డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతిలో గురజాడ రచనలపై పరిశోధన చేసారు. విజయవాడలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈనాడు, వార్త దిన పత్రికలలో, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వార పత్రికలలో, వనితా జ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక లలో వీరి కథలు గతంలో ప్రచురితమయ్యాయి. విపులలో అనువాద కథలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కథలు, కవిత్వం, అనువాద కవిత్వం, వ్యాసాలు రాస్తున్నారు. సాక్షి దినపత్రిక లో జ్యోతిర్మయం శీర్షిక కు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.

మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం -సాహిత్యం, ‘చెంగల్వ పూలు’ కథల సంపుటం, "అక్షర జ్యోతి" ఆధ్యాత్మిక వ్యాస సంపుటి మొదలైనవి వీరి ప్రచురితమైన పుస్తకాలు. తమ శ్రీవారి తో కలిసి, సుప్రసిద్ధ కథకులు, బహు గ్రంథకర్త విహారి గారి సాహిత్య జీవిత ప్రస్థానాన్ని "దర్పణం"
పేరుతో రచించారు. కథ, కవిత్వం, అనువాదం అభిమాన ప్రక్రియలు.

అభిప్రాయాలు