ఆంగ్లమూలం : The Road Not Taken By Robert Frost
తెలుగు అనువాదం: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
పసుపు రంగు ఆకులతో నిండిన
ఆ అడవిలో మార్గం రెండుగా చీలింది
ఒకే బాటసారినై
రెండు దారులలో ప్రయాణించలేనన్న
ఓ అసంతృప్తి ,
చాలాసేపు అక్కడ నిలబడ్డాను
కనుచూపు మేర దాటి వంపు తిరిగిన ఆ దారి
ఎటు పోతుందో చూడాలని చూస్తూ,
మరోదారిని ఎన్నుకున్నాను
అది కూడా మొదటిదానంత అందంగా ఉంది
బహుశా ఇంకా గొప్పగా,
ఇది దట్టమైన పచ్చికతో అడుగుల స్పర్శను కోరుకుంటోంది
నిజానికి, పాదచారుల అడుగుల స్పర్శ ఆ రెండు మార్గాలను చదునుగా చేసింది
ఆ ఉదయం రెండు దారులు ఒకే విధంగా ఉన్నాయి
పరచుకున్న ఆకులు ఎవరి పాదస్పర్శతో
కమిలిపోలేదు
మొదటి దారిని మరోసారి నడుద్దామనుకున్నాను!
కాని, ఒకదారి మరోదారిలోకి మలుపు తిరిగిపోతుందని తెలిసి
నేను ఎప్పటికీ తిరిగిరాలేనేమోనని సందేహించాను
ఈ ఉదంతాన్ని ఎప్పుడో చాలా కాలం తర్వాత ఒక నిట్టూర్పు తో చెప్పుకుంటాను
“ ఒక అడవిలో రెండు మార్గాలు విడిపోయాయి
నేను తక్కువ మంది నడచిన దారినే ఎన్నుకున్నాను
అదే నా జీవన గమనాన్నంతా మార్చేసింది.
![]()
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతిలో గురజాడ రచనలపై పరిశోధన చేసారు.విజయవాడ లో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈనాడు, వార్త దిన పత్రికలలో, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వార పత్రికలలో, వనితా జ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక లలో వీరి కథలు గతంలో ప్రచురితమయ్యాయి. విపులలో అనువాద కథలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కథలు, కవిత్వం,అనువాద కవిత్వం,వ్యాసాలు రాస్తున్నారు. సాక్షి దినపత్రిక లో జ్యోతిర్మయం శీర్షిక కు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం -సాహిత్యం, చెంగల్వ పూలు ‘కథల సంపుటం,” అక్షర జ్యోతి “ఆధ్యాత్మిక వ్యాస సంపుటి మొదలైనవి వీరి ప్రచురితమైన పుస్తకాలు. తమ శ్రీవారి తో కలిసి, సుప్రసిద్ధ కథకులు, బహు గ్రంథకర్త విహారి గారి సాహిత్య జీవిత ప్రస్థానాన్ని “దర్పణం” పేరుతో రచించారు.
కథ, కవిత్వం, అనువాదం అభిమాన ప్రక్రియలు.
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతిలో గురజాడ రచనలపై పరిశోధన చేసారు. విజయవాడలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈనాడు, వార్త దిన పత్రికలలో, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వార పత్రికలలో, వనితా జ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక లలో వీరి కథలు గతంలో ప్రచురితమయ్యాయి. విపులలో అనువాద కథలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కథలు, కవిత్వం, అనువాద కవిత్వం, వ్యాసాలు రాస్తున్నారు. సాక్షి దినపత్రిక లో జ్యోతిర్మయం శీర్షిక కు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం -సాహిత్యం, ‘చెంగల్వ పూలు’ కథల సంపుటం, “అక్షర జ్యోతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటి మొదలైనవి వీరి ప్రచురితమైన పుస్తకాలు. తమ శ్రీవారి తో కలిసి, సుప్రసిద్ధ కథకులు, బహు గ్రంథకర్త విహారి గారి సాహిత్య జీవిత ప్రస్థానాన్ని “దర్పణం”
పేరుతో రచించారు. కథ, కవిత్వం, అనువాదం అభిమాన ప్రక్రియలు.



