పిన్నంశెట్టి కిషన్

పిన్నంశెట్టి కిషన్

మానవీయ దృక్పథం తో సాహిత్య సృజన చేస్తున్న పిన్నంశెట్టి కిషన్ 8 ఫిబ్రవరి, 1962 న వేములవాడ లో జన్మించారు. తండ్రి: అచల పరిపూర్ణ శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య. తల్లి: శ్రీమతి మంచె లక్ష్మీబాయి. ఎం. ఏ., బీఎడ్., చదివి తూనికలు-కొలతలు శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు అరవై కథలు, వందకు పైగా కవితలు, కొన్ని విమర్శనా వ్యాసాలు రాశారు.

కథా విభాగంలో “ లేంబాళ వాటిక కథలు “, కవితా విభాగంలో “ నల్ల పద్యం “ సంపుటాలు వెలువడ్డాయి. వేములవాడ నేపథ్యంలో 1970 నుంచి 1990 వరకు గల ఊరి సామాజిక స్థితిగతుల్ని ఆత్మకథనాత్మక శైలిలో “లేంబాళ వాటిక కథలు “ రాశారు. లేంబాళ వాటిక కథలకు గూడూరి సీతారాం కథా పురస్కారం-2024 నకు మరియు పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం-2025 నకు లభించాయి.
2023 వ సంవత్సరానికి, కథా విభాగంలో లేంబాళ వాటిక కథలు సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం వచ్చింది. “నల్ల పద్యం’’ కవితా సంపుటికి హాసిని రామచంద్ర లిటిరరీ పౌండేషన్, ఖమ్మం వారి పురస్కారం 2024 లభించింది.

ఈ సంచికలో…

అభిప్రాయాలు